జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్...!
- జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ
- ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగులు
- బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్లు జరిగినట్లు సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్లు జరిగాయని తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్లు వేసినట్లు చెబుతున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ కాశారని సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలుపుతున్నాయి.