మహిళల ప్రపంచకప్: వర్షం దెబ్బకు మారిన కివీస్ లక్ష్యం.. 44 ఓవర్లలో 325 పరుగులు!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఛేజింగ్‌కు వర్షం మరోసారి అడ్డంకిగా మారింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం కురవడంతో కివీస్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిని ఆశ్రయించి, న్యూజిలాండ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా సవరించారు. 

అంతకుముందు, భారత ఇన్నింగ్స్ 48వ ఓవర్ తర్వాత చిరుజల్లులు పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. మైదాన సిబ్బంది వెంటనే కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆట నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా, నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన (95 బంతుల్లో 109), ప్రతీక రావల్ (134 బంతుల్లో 122) అద్భుతమైన సెంచరీలతో బలమైన పునాది వేశారు. స్మృతి తన ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడగా, ప్రతీక 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో నిలకడగా రాణించింది. వీరిద్దరి భాగస్వామ్యం భారత భారీ స్కోరుకు బాటలు వేసింది.

చివర్లో జెమీమా రోడ్రిగ్స్ కేవలం 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె రాకతో స్కోరు బోర్డు మరింత వేగంగా కదిలింది. పవర్‌ప్లేలో నెమ్మదిగా ఆడినప్పటికీ, మధ్య ఓవర్లలో భారత బ్యాటర్లు పరుగుల వేగాన్ని పెంచి కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

New Zealand Women's Cricket Team
Women's World Cup
India Women's Cricket Team
Smriti Mandhana
Pratika Rawal
Jemimah Rodrigues
DLS method
cricket
womens cricket
rain rule

More Telugu News