తొలి వన్డేలో టీమిండియా ఓటమి... డీఎల్ఎస్ విధానంలో ఆసీస్ విన్
- తొలి వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం
- డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు
- ఆసీస్ పేసర్ల ధాటికి భారత టాపార్డర్ కుదేలు
- కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పోరాటం వృథా
- కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్
- మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) భారత్పై ఘన విజయం సాధించింది. కంగారూ బౌలర్ల విజృంభణకు తోడు కెప్టెన్ మిచెల్ మార్ష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో రాణించడంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. వారి ధాటికి రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్మన్ గిల్ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో 9 ఓవర్లలోపే భారత్ 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (11) కూడా నిరాశపరిచాడు.
ఈ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) కాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔటయ్యారు. చివర్లో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 19 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో మెరవడంతో, వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఇన్నింగ్స్లో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునెమాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్య ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కకపోయినా, కెప్టెన్ మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 46 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి జోష్ ఫిలిప్పే (37) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ విజయం ఖాయమైంది. చివరి వరకు క్రీజులో నిలిచిన మార్ష్, రెన్షా (21 నాటౌట్)తో కలిసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండ్ వన్డే అక్టోబరు 23న అడిలైడ్ లో జరగనుంది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. వారి ధాటికి రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్మన్ గిల్ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో 9 ఓవర్లలోపే భారత్ 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (11) కూడా నిరాశపరిచాడు.
ఈ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) కాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔటయ్యారు. చివర్లో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 19 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో మెరవడంతో, వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఇన్నింగ్స్లో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునెమాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్య ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కకపోయినా, కెప్టెన్ మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 46 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి జోష్ ఫిలిప్పే (37) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ విజయం ఖాయమైంది. చివరి వరకు క్రీజులో నిలిచిన మార్ష్, రెన్షా (21 నాటౌట్)తో కలిసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండ్ వన్డే అక్టోబరు 23న అడిలైడ్ లో జరగనుంది.