బీసీ సంఘాల బంద్ లో కల్వకుంట్ల కవిత కుమారుడు.. వీడియో ఇదిగో!

––
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా.. ఎక్కడికక్కడ బీసీ సంఘాల నేతలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ లో తెలంగాణ జాగృతి కూడా పాలుపంచుకుంది. ఖైరతాబాదు చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని, రాష్ట్రంలోని బీసీలు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు.


More Telugu News