బీఆర్ఎస్ నేత రాసిన ‘నా ఆలోచనలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
- పిన్నింటి విజయ్ కుమార్ రాసిన పుస్తకం 'నా ఆలోచనలు'
- కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఉద్యమంపై రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం
- చదవడం తగ్గుతున్న రోజుల్లో యువ రచయితలను ప్రోత్సహించాలని కేటీఆర్ పిలుపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకుడు పిన్నింటి విజయ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం ‘నా ఆలోచనలు’ పుస్తకాన్ని ఆయన తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో విజయ్ కుమార్ వంటి యువకులు పుస్తకాలు రాయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ, జాతీయ అంశాలపై విజయ్ కుమార్కు మంచి అవగాహన ఉందని, ఆయన వ్యాసాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. గొప్ప సామాజిక స్పృహతో, కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
అనంతరం రచయిత విజయ్ కుమార్ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు రచయితకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు శేరి సుభాష్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కేయూ బీఆర్ఎస్వీ ఇంచార్జి జెట్టి రాజేందర్ తదితరులు పాల్గొని విజయ్ కుమార్ను అభినందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో విజయ్ కుమార్ వంటి యువకులు పుస్తకాలు రాయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ, జాతీయ అంశాలపై విజయ్ కుమార్కు మంచి అవగాహన ఉందని, ఆయన వ్యాసాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. గొప్ప సామాజిక స్పృహతో, కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
అనంతరం రచయిత విజయ్ కుమార్ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు రచయితకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు శేరి సుభాష్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కేయూ బీఆర్ఎస్వీ ఇంచార్జి జెట్టి రాజేందర్ తదితరులు పాల్గొని విజయ్ కుమార్ను అభినందించారు.