Team India: విండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకులో ఎక్కడంటే..!

Updated World Test Championship Points Table As India Sweep Against West Indies
షార్ట్స్‌లో చూడండి
స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ జట్టు మరోసారి నిరూపించుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సునాయాసంగా క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నప్పటికీ, ర్యాంకులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకువెళ్లగలిగినా, శుభ్‌మన్ గిల్ సేన విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ సిరీస్ విజయంతో భారత్ డ‌బ్ల్యూటీసీ పాయింట్ల సంఖ్య 52కు చేరుకుంది. మొత్తం పాయింట్ల శాతాన్ని (పీసీటీ) 61.90కు పెంచుకుంది. అయినప్పటికీ, పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. 2025-27 డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించింది.

ప్రస్తుత డ‌బ్ల్యూటీసీ పట్టికను పరిశీలిస్తే, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 100 పాయింట్ల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచిన శ్రీలంక 66.67 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్ తర్వాత ఇంగ్లండ్ (43.33 శాతం), బంగ్లాదేశ్ (16.67 శాతం), వెస్టిండీస్ (0.00 శాతం) వరుస స్థానాల్లో నిలిచాయి. తాజా క్లీన్‌స్వీప్ భారత్‌కు కీలక పాయింట్లను అందించినప్పటికీ, టాప్-2లోకి చేరాలంటే రాబోయే సిరీస్‌లలో విజయాలు నమోదు చేయడం తప్పనిసరి.
Go Back to Shorts
Team India
India Cricket
India vs West Indies
World Test Championship
WTC Points Table
India WTC ranking
Shubman Gill
Arun Jaitley Stadium
Cricket series

More Telugu News