RV Deshpande: గ్యారెంటీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వివరణ కోరిన కర్ణాటక సీఎం

RV Deshpande Congress MLA Comments on Guarantee Schemes
  • ఐదు గ్యారెంటీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దేశ్‌పాండే అసంతృప్తి
  • తాను సీఎం అయితే ఈ పథకాలు అమలు చేసేవాడిని కాదంటూ వ్యాఖ్య
  • ఆర్టీసీ బస్సులు మహిళలకే పరిమితమయ్యాయని ఆవేదన
  • గృహలక్ష్మి పథకం పురుషులను శిక్షించడం లాంటిదేనని వివాదాస్పద వ్యాఖ్య
  • దేశ్‌పాండే వ్యాఖ్యలపై వివరణ కోరిన సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను గనుక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉంటే, ఈ గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాల వల్ల ఆర్టీసీ బస్సులు కేవలం మహిళలకే అన్నట్లుగా మారిపోయాయని దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. "ఓ దేవుడా.. ధారవాడ, బెళగావి, కలబురగితో పాటు రేణుకా యల్లమ్మ ఆలయానికి వెళ్లే బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో పురుషులు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని ఆయన పేర్కొన్నారు. బస్సుల్లో పురుషులకు కనీసం సీట్లు కూడా దొరకడం లేదని అన్నారు.

అదేవిధంగా, గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,000 ఇవ్వడం వారికి లాటరీ తగిలినట్లుగా ఉందని, కానీ పురుషుల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైందని దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే, ఈ పథకం పరోక్షంగా పురుషులను శిక్షించడం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా పరిగణించారు. దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.  
RV Deshpande
Karnataka Congress
Guarantee Schemes
Siddaramaiah
Gruhalakshmi Scheme
RTC Buses
Free Bus Travel
Karnataka Politics
Congress MLA
Welfare Schemes

More Telugu News