రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రస్తావనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆప్ఘన్ మంత్రి ముత్తాఖీ
- ఏడు రోజుల భారత పర్యటనలో ఆప్ఘన్ విదేశాంగ మంత్రి
- ఠాగూర్ 'కాబూలీవాలా'ను ప్రస్తావించి ఆకట్టుకున్న వైనం
- విదేశాంగ మంత్రి జైశంకర్తో కీలక భేటీ
- కాబూల్లోని టెక్నికల్ మిషన్ను రాయబార కార్యాలయంగా అప్గ్రేడ్
- తమ భూభాగాన్ని ఇతరులపై వాడబోమని ఆప్ఘన్ హామీ
- ఉత్తరప్రదేశ్లోని దారుల్ ఉలూమ్ దేవబంద్ సందర్శన
భారత్, ఆప్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు కేవలం రాజకీయ, ఆర్థిక పరమైనవి కావు.. శతాబ్దాలుగా పెనవేసుకున్న సాంస్కృతిక బంధం కూడా ఉందని ఆప్ఘన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాఖీ గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ప్రఖ్యాత 'కాబూలీవాలా' కథను ప్రస్తావించగానే సభికులంతా భావోద్వేగానికి, ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఒక్క సంఘటన ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న లోతైన అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత్లో ఏడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ముత్తాఖీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (విఐఎఫ్) నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత విశ్లేషకులు, నిపుణులతో ముచ్చటించారు. ఈ సమావేశానికి ప్రముఖ మహిళా పండితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను ముత్తాఖీ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
పర్యటనలో భాగంగా శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ముత్తాఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాబూల్లోని భారత టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్కు 5 అంబులెన్సులను అందజేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు, సామర్థ్య పెంపు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
భారత్తో సత్సంబంధాలను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని ముత్తాఖీ స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించనీయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఆప్ఘనిస్థాన్లో భూకంపం సంభవించినప్పుడు మొదట స్పందించింది భారతేనని గుర్తుచేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తన పర్యటనలో భాగంగా ముత్తాఖీ శనివారం నాడు ఉత్తరప్రదేశ్లోని చారిత్రక దారుల్ ఉలూమ్ దేవబంద్ను సందర్శించి, అక్కడి ఇస్లామిక్ పండితులతో చర్చలు జరిపారు. ఆప్ఘనిస్థాన్లో పాలన మారిన తర్వాత ఒక తాలిబన్ సీనియర్ నేత దేవబంద్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఆదివారం ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించి, సోమవారం ఢిల్లీలో భారత వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు.
భారత్లో ఏడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ముత్తాఖీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (విఐఎఫ్) నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత విశ్లేషకులు, నిపుణులతో ముచ్చటించారు. ఈ సమావేశానికి ప్రముఖ మహిళా పండితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను ముత్తాఖీ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
పర్యటనలో భాగంగా శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ముత్తాఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాబూల్లోని భారత టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్కు 5 అంబులెన్సులను అందజేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు, సామర్థ్య పెంపు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
భారత్తో సత్సంబంధాలను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని ముత్తాఖీ స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించనీయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఆప్ఘనిస్థాన్లో భూకంపం సంభవించినప్పుడు మొదట స్పందించింది భారతేనని గుర్తుచేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తన పర్యటనలో భాగంగా ముత్తాఖీ శనివారం నాడు ఉత్తరప్రదేశ్లోని చారిత్రక దారుల్ ఉలూమ్ దేవబంద్ను సందర్శించి, అక్కడి ఇస్లామిక్ పండితులతో చర్చలు జరిపారు. ఆప్ఘనిస్థాన్లో పాలన మారిన తర్వాత ఒక తాలిబన్ సీనియర్ నేత దేవబంద్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఆదివారం ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించి, సోమవారం ఢిల్లీలో భారత వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు.