రామ్‌చరణ్ 'పెద్ది' నుంచి క్రేజీ న్యూస్.. ఆ పాట షూటింగ్ రేపే!

  • 'పెద్ది' స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో
  • ఏఆర్ రెహమాన్ సంగీతం.. చరణ్, జాన్వీలపై చిత్రీకరణ
  • ఇప్పటికే 60 శాతం పూర్తయిన సినిమా షూటింగ్
  • కొత్త యాస, రగ్డ్ లుక్‌తో కనిపించనున్న చెర్రీ
  • 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ రేప‌టి నుంచి పూణెలో మొదలుకానుంది. ఈ పాటలో రామ్‌చరణ్‌తో కలిసి జాన్వీ కపూర్ స్టెప్పులేయనున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను మెలోడీ, ఎనర్జీ కలగలిసిన ట్యూన్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ గ్రేస్, జాన్వీతో ఆయన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఈ పాట కీలకంగా ఉండనుందని సమాచారం.

ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్‌..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగం ఎడిటింగ్ పనులు కూడా నవీన్ నూలి దాదాపు పూర్తి చేశారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. పెరిగిన గడ్డం, మీసాలతో పాటు ముక్కు రింగ్‌తో ఆయన గెటప్ చాలా ప్రత్యేకంగా ఉండనుంది.

ఈ సినిమాపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ, "బుచ్చి బాబు రాసిన కథ అద్భుతంగా ఉంది. 'రంగస్థలం' నుంచి కొంత స్ఫూర్తి ఉన్నప్పటికీ, 'పెద్ది' కథ పూర్తిగా కొత్తది. ఇది ఏ సినిమాను పోలి ఉండదు. ఈ పాత్ర కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాసను ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


More Telugu News