Chandrababu Naidu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం... రామ్మూర్తినాయుడుకు నివాళి
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెను సందర్శించారు. కుటుంబపరమైన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు గ్రామానికి విచ్చేశారు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి సందర్భంగా నేడు సంవత్సరీకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. నారావారిపల్లెలోని వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రామ్మూర్తినాయుడు తనయుడు, నటుడు నారా రోహిత్ సంవత్సరీకం క్రతువు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన స్మృతులను గుర్తుచేసుకుని పుష్పాంజలి అర్పించారు.
ఈ కుటుంబ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, నారా రోహిత్తో పాటు ఇతర బంధువులు కూడా ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. నారావారిపల్లెలోని వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రామ్మూర్తినాయుడు తనయుడు, నటుడు నారా రోహిత్ సంవత్సరీకం క్రతువు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన స్మృతులను గుర్తుచేసుకుని పుష్పాంజలి అర్పించారు.
ఈ కుటుంబ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, నారా రోహిత్తో పాటు ఇతర బంధువులు కూడా ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.