విజయ్ ప్రచార రథం సీజ్ చేసిన పోలీసులుు

  • విజయ్ కరూర్ సభలో తీవ్ర విషాదం.. 41 మంది మృతి
  • సభకు ముందే ప్రచార రథం కిందపడి ఇద్దరికి గాయాలు
  • రోడ్డు ప్రమాదం ఘటనలో విజయ్ ప్రచార వాహనం సీజ్
ఇటీవల తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, విజయ్‌కు మరో షాక్ తగిలింది.

కరూర్ సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆ ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


More Telugu News