Nalgonda road accident: నసర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి

Nalgonda Road Accident Three Youths Died
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే, నలుగురు యువకులు ఆటోలో హైదరాబాద్ నుంచి దేవరకొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో నసర్లపల్లి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు మటిక తండాకు చెందినవారిగా గుర్తింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను దేవరకొండ మండలం మటిక తండాకు చెందిన భాస్కర్, వినోద్, రవిగా గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గ్రామంలో విషాద ఛాయలు

ఘటన గురించి తెలిసిన వెంటనే మటిక తండా గ్రామంలో విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు, బంధువులు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. 
Go Back to Shorts
Nalgonda road accident
Nalgonda
road accident
Telangana
Hyderabad
Devarakonda
Matika Thanda
car accident

More Telugu News