Haryana School: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసి చితకబాదారు!
- హర్యానా పానిపట్లోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిపై అమానుషం
- తరగతి గదిలో బాలుడిని తలక్రిందులుగా వేలాడదీసిన డ్రైవర్
- ప్రిన్సిపాల్ ఆదేశాలతోనే దాడి జరిగిందని తల్లి ఆరోపణ
- పిల్లలను ప్రిన్సిపాల్ కొడుతున్న మరో వీడియో కూడా వైరల్
- ప్రిన్సిపాల్, డ్రైవర్పై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు
హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో రెండో తరగతి చదువుతున్న బాలుడిని తలకిందులుగా వేలాడదీసి చితకబాదిన అమానవీయ ఘటన హర్యానాలోని పానిపట్లో వెలుగుచూసింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పానిపట్లోని జట్టల్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. ముఖిజా కాలనీకి చెందిన డోలీ అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడిని ఇటీవలే ఈ పాఠశాలలో చేర్పించారు. తన కొడుకు హోంవర్క్ పూర్తి చేయలేదని ప్రిన్సిపాల్ రీనా ఆగ్రహం వ్యక్తం చేశారని, బాలుడిని శిక్షించమని స్కూల్ డ్రైవర్ అజయ్కు చెప్పారని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో డ్రైవర్ అజయ్ బాలుడిని తాళ్లతో కట్టి, కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆ చిన్నారిని కొడుతూ స్నేహితులకు వీడియో కాల్స్ చేసి మరీ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పెట్టడంతో అది కాస్తా బాలుడి కుటుంబసభ్యులకు చేరింది.
దీంతోపాటు ప్రిన్సిపాల్ రీనా స్వయంగా చిన్న పిల్లలను ఇతర విద్యార్థుల ముందే కొడుతున్న మరో వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా ఇద్దరు బాలికలతో అమర్యాదగా ప్రవర్తించినందుకే తల్లిదండ్రులకు చెప్పి మరీ వారిని దండించానని సమర్థించుకున్నారు. అయితే, పాఠశాలల్లో శారీరక దండనను నిషేధిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. కొన్నిసార్లు శిక్షగా పిల్లలతో టాయిలెట్లు కూడా కడిగిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ రీనా స్పందిస్తూ ఆగస్టు 13న బాలుడిని మందలించమని మాత్రమే డ్రైవర్కు చెప్పానని తెలిపారు. ప్రవర్తన సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో అజయ్ను ఆగస్టులోనే పనిలోంచి తొలగించామని వివరించారు. అయితే, వీడియో బయటకు వచ్చాక అజయ్ కొందరు వ్యక్తులను తమ ఇంటికి పంపి బెదిరించాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మోడల్ టౌన్ పోలీసులు ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్పై జువైనల్ జస్టిస్ చట్టం, 2015 కింద కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలల్లో పిల్లల రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పానిపట్లోని జట్టల్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. ముఖిజా కాలనీకి చెందిన డోలీ అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడిని ఇటీవలే ఈ పాఠశాలలో చేర్పించారు. తన కొడుకు హోంవర్క్ పూర్తి చేయలేదని ప్రిన్సిపాల్ రీనా ఆగ్రహం వ్యక్తం చేశారని, బాలుడిని శిక్షించమని స్కూల్ డ్రైవర్ అజయ్కు చెప్పారని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో డ్రైవర్ అజయ్ బాలుడిని తాళ్లతో కట్టి, కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆ చిన్నారిని కొడుతూ స్నేహితులకు వీడియో కాల్స్ చేసి మరీ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పెట్టడంతో అది కాస్తా బాలుడి కుటుంబసభ్యులకు చేరింది.
దీంతోపాటు ప్రిన్సిపాల్ రీనా స్వయంగా చిన్న పిల్లలను ఇతర విద్యార్థుల ముందే కొడుతున్న మరో వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా ఇద్దరు బాలికలతో అమర్యాదగా ప్రవర్తించినందుకే తల్లిదండ్రులకు చెప్పి మరీ వారిని దండించానని సమర్థించుకున్నారు. అయితే, పాఠశాలల్లో శారీరక దండనను నిషేధిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. కొన్నిసార్లు శిక్షగా పిల్లలతో టాయిలెట్లు కూడా కడిగిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ రీనా స్పందిస్తూ ఆగస్టు 13న బాలుడిని మందలించమని మాత్రమే డ్రైవర్కు చెప్పానని తెలిపారు. ప్రవర్తన సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో అజయ్ను ఆగస్టులోనే పనిలోంచి తొలగించామని వివరించారు. అయితే, వీడియో బయటకు వచ్చాక అజయ్ కొందరు వ్యక్తులను తమ ఇంటికి పంపి బెదిరించాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మోడల్ టౌన్ పోలీసులు ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్పై జువైనల్ జస్టిస్ చట్టం, 2015 కింద కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలల్లో పిల్లల రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.