నర్సంపేటలో ఆవుకు సీమంతం.. బంధుమిత్రులను పిలిచి ఘనంగా వేడుక
––
ఆడపిల్లలు లేని లోటును పూడ్చుకోవడానికి ఆ ఆవుదూడకు గౌరి అని పేరుపెట్టి కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నారు. ఇటీవల గౌరి గర్భం దాల్చడంతో సొంత కూతురుకు జరిపించినట్లు సీమంతం జరిపించారు. బంధుమిత్రులను ఆహ్వానించి శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించారు. ఐదు రకాల పిండి వంటకాలు, పండ్లు, పూలను ముత్తయిదువలతో ఆవుకు పెట్టించారు. గోమాత ప్రాముఖ్యం అందరికీ తెలిసేలా ఈ వేడుకను నిర్వహించామని సురేందర్ తెలిపారు.