జూబ్లీహిల్స్ బరిలో మాగంటి సునీత.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
  • దివంగత మాగంటి గోపీనాథ్ అర్ధాంగి సునీతకు టికెట్
  • మాగంటి సేవలకు గుర్తింపుగా కుటుంబానికే అవకాశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఖరారు చేసింది. దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీత‌ను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు.

మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతగా, నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన గోపీనాథ్ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.

పార్టీకి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అందించిన సేవలను గౌరవిస్తూ, ఆయన భార్యకు టికెట్ కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను పంపినట్లయింది.

Maganti Sunitha
Jubilee Hills
BRS
KCR
Maganti Gopinath
Telangana Elections
Telangana Politics
By-Election
Assembly Elections

More Telugu News