అతడిని చంపడం సరదాగా అనిపించింది.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘాతుకం
- అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడి కిరాతకం
- లైంగిక నేరస్థుడిని వెతుక్కుంటూ వెళ్లి హత్య
- ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా బాధితుడిని గుర్తించిన నిందితుడు
- సీఏగా నటిస్తూ ఇంటికి వెళ్లి కత్తితో కిరాతకంగా దాడి
- లైంగిక నేరస్థులకు మరణమే సరైనదన్న వరుణ్ సురేశ్
- గతంలో బాంబు బెదిరింపు కేసులోనూ అరెస్ట్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువకుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. లైంగిక నేరస్థుల వివరాలు ఉండే ప్రభుత్వ డేటాబేస్ నుంచి ఒకరిని ఎంచుకుని, అతడిని వెతుక్కుంటూ వెళ్లి దారుణంగా హత్య చేశాడు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... గతంలో చిన్నారులపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవించిన డేవిడ్ బ్రిమ్మర్ (71) అనే వ్యక్తిని భారత సంతతికి చెందిన వరుణ్ సురేశ్ (29) అనే వ్యక్తి లక్ష్యంగా చేసుకున్నాడు. కాలిఫోర్నియా ప్రభుత్వం నిర్వహించే 'మెగాన్స్ లా' వెబ్సైట్ ద్వారా బ్రిమ్మర్ చిరునామాను గుర్తించాడు. అనంతరం తాను ఒక సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీపీఏ) అని, క్లయింట్ల కోసం వెతుకుతున్నానని నమ్మించేందుకు ఒక బ్యాగ్, నోట్బుక్, కాఫీ కప్పుతో బ్రిమ్మర్ ఇంటికి వెళ్లాడు.
అక్కడ బ్రిమ్మర్ను గుర్తించిన తర్వాత, "నేను సరైన వ్యక్తినే పట్టుకున్నానని నాకు తెలుసు" అని చెప్పి కరచాలనం చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బ్రిమ్మర్ ప్రాణభయంతో బయటకు పారిపోయి, సహాయం కోసం వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు బ్లాకుల దూరం పరుగెత్తి పక్కింటి గ్యారేజ్లోకి, ఆ తర్వాత వంటగదిలోకి దూరాడు. వరుణ్ అతడిని వెంబడించి, "పశ్చాత్తాపపడు" అంటూ మెడలో కత్తితో పొడిచాడు. బాధితుడు దూరంగా పాకేందుకు ప్రయత్నిస్తుండగా గొంతు కోసి చంపాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుణ్ సురేశ్ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వరుణ్ చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. "లైంగిక నేరస్థులు పిల్లలను హింసిస్తారు. వారు చనిపోవడానికి అర్హులు. చాలాకాలంగా ఒక లైంగిక నేరస్థుడిని చంపాలని అనుకుంటున్నాను" అని చెప్పినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి. బ్రిమ్మర్ను చంపడం "నిజంగా చాలా సరదాగా అనిపించింది" అని, తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతడు చెప్పడం గమనార్హం.
నిందితుడి ఫోన్ను పరిశీలించగా, 'మెగాన్స్ లా' వెబ్సైట్లోని పలువురి ప్రొఫైల్స్ స్క్రీన్షాట్లు లభించాయి. బ్రిమ్మర్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ను హత్యకు కేవలం 45 నిమిషాల ముందే తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
వరుణ్ సురేశ్పై 2021లో కూడా ఫ్రీమాంట్లోని హయత్ ప్లేస్ హోటల్లో ఫేక్ బాంబు బెదిరింపులకు పాల్పడిన కేసు ఉంది. హయత్ హోటల్స్ సీఈఓ ఒక పెడోఫైల్ అని, అతడిని చంపాలని తాను చాలాకాలంగా ప్రయత్నిస్తున్నానని అప్పట్లో పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం వరుణ్పై అలమేడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం హత్య, నివాసంలోకి అక్రమంగా చొరబడటం, ప్రాణాంతక ఆయుధాన్ని ఉపయోగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసింది.
వివరాల్లోకి వెళితే... గతంలో చిన్నారులపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవించిన డేవిడ్ బ్రిమ్మర్ (71) అనే వ్యక్తిని భారత సంతతికి చెందిన వరుణ్ సురేశ్ (29) అనే వ్యక్తి లక్ష్యంగా చేసుకున్నాడు. కాలిఫోర్నియా ప్రభుత్వం నిర్వహించే 'మెగాన్స్ లా' వెబ్సైట్ ద్వారా బ్రిమ్మర్ చిరునామాను గుర్తించాడు. అనంతరం తాను ఒక సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీపీఏ) అని, క్లయింట్ల కోసం వెతుకుతున్నానని నమ్మించేందుకు ఒక బ్యాగ్, నోట్బుక్, కాఫీ కప్పుతో బ్రిమ్మర్ ఇంటికి వెళ్లాడు.
అక్కడ బ్రిమ్మర్ను గుర్తించిన తర్వాత, "నేను సరైన వ్యక్తినే పట్టుకున్నానని నాకు తెలుసు" అని చెప్పి కరచాలనం చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బ్రిమ్మర్ ప్రాణభయంతో బయటకు పారిపోయి, సహాయం కోసం వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు బ్లాకుల దూరం పరుగెత్తి పక్కింటి గ్యారేజ్లోకి, ఆ తర్వాత వంటగదిలోకి దూరాడు. వరుణ్ అతడిని వెంబడించి, "పశ్చాత్తాపపడు" అంటూ మెడలో కత్తితో పొడిచాడు. బాధితుడు దూరంగా పాకేందుకు ప్రయత్నిస్తుండగా గొంతు కోసి చంపాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుణ్ సురేశ్ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వరుణ్ చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. "లైంగిక నేరస్థులు పిల్లలను హింసిస్తారు. వారు చనిపోవడానికి అర్హులు. చాలాకాలంగా ఒక లైంగిక నేరస్థుడిని చంపాలని అనుకుంటున్నాను" అని చెప్పినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి. బ్రిమ్మర్ను చంపడం "నిజంగా చాలా సరదాగా అనిపించింది" అని, తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతడు చెప్పడం గమనార్హం.
నిందితుడి ఫోన్ను పరిశీలించగా, 'మెగాన్స్ లా' వెబ్సైట్లోని పలువురి ప్రొఫైల్స్ స్క్రీన్షాట్లు లభించాయి. బ్రిమ్మర్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ను హత్యకు కేవలం 45 నిమిషాల ముందే తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
వరుణ్ సురేశ్పై 2021లో కూడా ఫ్రీమాంట్లోని హయత్ ప్లేస్ హోటల్లో ఫేక్ బాంబు బెదిరింపులకు పాల్పడిన కేసు ఉంది. హయత్ హోటల్స్ సీఈఓ ఒక పెడోఫైల్ అని, అతడిని చంపాలని తాను చాలాకాలంగా ప్రయత్నిస్తున్నానని అప్పట్లో పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం వరుణ్పై అలమేడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం హత్య, నివాసంలోకి అక్రమంగా చొరబడటం, ప్రాణాంతక ఆయుధాన్ని ఉపయోగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసింది.