బెట్టింగ్ యాప్ కేసులో సోనూ సూద్పై ఈడీ ప్రశ్నల వర్షం.. ఏడు గంటలకు పైగా విచారణ
- 1xBet బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సోనూ సూద్ విచారణ
- ఈడీ కార్యాలయంలో 7 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నలు
- నిన్న మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను కూడా విచారించిన అధికారులు
- ఇప్పటికే రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, సురేశ్ రైనాల విచారణ పూర్తి
- రూ. 5000 కోట్ల హవాలా రాకెట్తో సంబంధాలపై ఈడీ దర్యాప్తు
- యాప్కు ప్రచారం చేసినందుకే సినీ, క్రీడా ప్రముఖులకు నోటీసులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1xBetకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం సోనూ సూద్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి తన కారులో వెళ్లిపోయారు.
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. నిన్న భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఆయనతో పాటు నటి, ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యాప్ను ప్రమోట్ చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు వారి నుంచి సేకరించినట్లు సమాచారం. ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలను కూడా సమర్పించమని వారిని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
యూఏఈలో 1xBet యాప్ వ్యవస్థాపకుల్లో ఒకరు ఇచ్చిన భారీ విందు తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా యూఏఈ, పాకిస్థాన్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల భారీ హవాలా రాకెట్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బెట్టింగ్ యాప్కు ప్రచారం కల్పించినందుకు గాను ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది. సోమవారం మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, అంతకుముందు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది.
1xBet యాప్ ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ వంటి అనేక క్రీడలపై బెట్టింగ్కు అవకాశం కల్పిస్తోంది. అయితే, ఆర్థిక అక్రమాలపై ఆరోపణలు, దర్యాప్తులు తీవ్రం కావడంతో ఇప్పటికే యూకే, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి పలు దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. నిన్న భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఆయనతో పాటు నటి, ఇన్ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యాప్ను ప్రమోట్ చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు వారి నుంచి సేకరించినట్లు సమాచారం. ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలను కూడా సమర్పించమని వారిని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
యూఏఈలో 1xBet యాప్ వ్యవస్థాపకుల్లో ఒకరు ఇచ్చిన భారీ విందు తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా యూఏఈ, పాకిస్థాన్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల భారీ హవాలా రాకెట్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బెట్టింగ్ యాప్కు ప్రచారం కల్పించినందుకు గాను ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది. సోమవారం మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, అంతకుముందు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది.
1xBet యాప్ ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ వంటి అనేక క్రీడలపై బెట్టింగ్కు అవకాశం కల్పిస్తోంది. అయితే, ఆర్థిక అక్రమాలపై ఆరోపణలు, దర్యాప్తులు తీవ్రం కావడంతో ఇప్పటికే యూకే, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి పలు దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది.