Andhra Pradesh Rains: ఏపీపై జంట అల్పపీడనాల ప్రభావం... నాలుగు రోజుల పాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి తోడు గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా రేపు (మంగళవారం), ఎల్లుండి (బుధవారం) ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రత్యేకంగా హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇక గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Andhra Pradesh Rains
AP Rains
Heavy Rainfall
IMD Alert
Weather Forecast
Bay of Bengal Depression
Srikakulam
Vizianagaram
Coastal Andhra

More Telugu News