India Cricket: టీ20 క్రికెట్‌లో భారత్ అరుదైన మైలురాయి

India Achieves Rare Milestone in T20 Cricket
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు పొట్టి ఫార్మాట్‌లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో గ్రూప్-ఏ మ్యాచ్ ద్వారా టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది.

ఇప్పటివరకు అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. పాక్ జట్టు మొత్తం 275 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ తర్వాత ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.

ఈ జాబితాలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. కివీస్ జట్టు ఇప్పటివరకు 235 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వారి తర్వాత వెస్టిండీస్ 228 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో, శ్రీలంక 212 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాయి. సుదీర్ఘకాలంగా టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ఈ ఫార్మాట్‌లో మరో మైలురాయిని చేరుకోవడం విశేషం.
Go Back to Shorts
India Cricket
India
T20 International
Pakistan Cricket
New Zealand Cricket
West Indies Cricket
Sri Lanka Cricket
Asia Cup 2025
Oman

More Telugu News