Kangana Ranaut: తమిళనాడుకు వస్తే కంగన చెంప చెళ్లుమంటుంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

KS Alagiri Calls for Slapping Kangana Ranaut if She Visits Tamil Nadu
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగన తమిళనాడు పర్యటనకు వస్తే ఆమెను చెంపదెబ్బ కొట్టాలని పిలుపునివ్వడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. రైతులపై కంగన గతంలో చేసిన వ్యాఖ్యలే అళగిరి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.

అళగిరి మీడియాతో మాట్లాడుతూ "నిన్న 10-15 మంది రైతులు నా దగ్గరకు వచ్చారు. వ్యవసాయ పనులు చేసే మహిళల గురించి కంగన గతంలో తప్పుగా మాట్లాడారని వాపోయారు. రూ.100 ఇస్తే ఆ మహిళలు ఎక్కడికైనా వస్తారని ఆమె అన్నట్లు గుర్తుచేశారు. ఒక సిట్టింగ్ ఎంపీ అయి ఉండి గ్రామీణ మహిళలను అంత చులకనగా మాట్లాడటం నన్ను షాక్‌కు గురిచేసింది" అని వివరించారు.

గతంలో ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కంగనను చెంపదెబ్బ కొట్టిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఆ అధికారిణి చేసిన పనినే, కంగన మన ప్రాంతానికి వస్తే మీరు కూడా చేయండి. అప్పుడే ఆమె తన తప్పు తెలుసుకుంటుంది" అని రైతులకు తాను సూచించినట్లు అళగిరి తెలిపారు. 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఆందోళనలో పాల్గొన్న ఓ వృద్ధురాలు రూ.100 కోసం వచ్చారని కంగన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ తర్వాత తీవ్ర విమర్శలతో దానిని తొలగించడం తెలిసిందే.

అళగిరి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో విలేకరులతో మాట్లాడుతూ "భారతదేశంలో నేను ఎక్కడికైనా వెళ్లగలను. నన్ను ఎవరూ ఆపలేరు. నన్ను ద్వేషించే వాళ్లు కొందరుంటే, ప్రేమించే వాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు" అని ఘాటుగా బదులిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటించిన తర్వాత తమిళనాడులో తనకు మంచి ఆదరణ లభించిందని ఆమె గుర్తుచేశారు. ఇటీవల పార్లమెంట్‌లో తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు కూడా తనను 'తలైవి' అని పిలిచారని కంగన పేర్కొన్నారు.
Go Back to Shorts
Kangana Ranaut
KS Alagiri
Tamil Nadu
farmers protest
Chandigarh airport
CISF constable
Thalaivi
Jayalalithaa biopic
BJP MP
Congress

More Telugu News