Chandrababu Naidu: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

TTD Invites CM Chandrababu for Sri Venkateswara Brahmotsavam
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లాంఛనంగా ఆహ్వానించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని బృందం బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. ఈ బృందంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యురాలు జానకీదేవి ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు పలికారు.

ఈ భేటీ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎంకు వివరించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలతో పాటు, ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలోని కీలక నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నాయి.
Go Back to Shorts
Chandrababu Naidu
Tirumala Brahmotsavam
TTD
Tirupati
Sri Venkateswara Swamy
BR Naidu
Anil Kumar Singhal
Andhra Pradesh
Hindu Festival

More Telugu News