తిప్పిరి తిరుపతికి మావోయిస్టు పార్టీ పగ్గాలు
- మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
- ఇటీవల మరణించిన బసవరాజు స్థానంలో నియామకం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దేవ్జీ
- తల మీద రూ. కోటి రివార్డు ప్రకటించిన పోలీసులు
- 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన దంతెవాడ దాడిలో కీలకపాత్ర
- తెలుగు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు అప్రమత్తం
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ నూతన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన సీనియర్ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులయ్యారు. ఇటీవల ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు (బసవరాజు) మరణించడంతో, ఆయన స్థానాన్ని దేవ్జీతో భర్తీ చేశారు. ఈ నియామకంతో మావోయిస్టు పార్టీ అత్యున్నత నాయకత్వ పగ్గాలు మరోసారి తెలుగు వ్యక్తి చేతికి వచ్చాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి అయిన తిప్పిరి తిరుపతి, 1983లో మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. సాధారణ దళ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మిలీషియా ఇన్ఛార్జ్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భద్రతా బలగాల దృష్టిలో తిప్పిరి తిరుపతి అత్యంత కీలకమైన మావోయిస్టు నేత. ఆయన తలపై పోలీసులు రూ. 1 కోటి రివార్డును ప్రకటించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న భీకర దాడికి దేవ్జీ సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘటనలో ఆయన పాత్ర ఉందని భద్రతా వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
దేవ్జీ నాయకత్వంలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవచ్చని, దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఈ మార్పు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భద్రతా బలగాలు ఆయన కదలికలపై నిశితంగా దృష్టి సారించాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి అయిన తిప్పిరి తిరుపతి, 1983లో మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. సాధారణ దళ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మిలీషియా ఇన్ఛార్జ్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భద్రతా బలగాల దృష్టిలో తిప్పిరి తిరుపతి అత్యంత కీలకమైన మావోయిస్టు నేత. ఆయన తలపై పోలీసులు రూ. 1 కోటి రివార్డును ప్రకటించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న భీకర దాడికి దేవ్జీ సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘటనలో ఆయన పాత్ర ఉందని భద్రతా వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
దేవ్జీ నాయకత్వంలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవచ్చని, దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఈ మార్పు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భద్రతా బలగాలు ఆయన కదలికలపై నిశితంగా దృష్టి సారించాయి.