బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్
- బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత
- హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు
- తెలంగాణ కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువ భరిస్తానని ట్వీట్
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జాగృతి కార్యాలయంలో ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. హరీశ్, సంతోష్ రావులు మేకవన్నె పులులు అని విమర్శించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు తనకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరుగుతుందని అన్నారు.