టీడీపీకి ఆ ధైర్యం లేదు: జగన్
- నల్లపురెడ్డిపల్లెలో పర్యటించిన మాజీ సీఎం జగన్
- ఓటర్ల స్వేచ్ఛను చంద్రబాబు హరించారంటూ ప్లకార్డులు ప్రదర్శించిన స్థానికులు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
ఈ సందర్భంగా, ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారంటూ పలువురు గ్రామస్థులు ఆయన వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఓటర్లపై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. "ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు" అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు.
గ్రామస్థులు చెప్పిన విషయాలపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో దౌర్జన్యాలు చేశారు" అని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలతో ప్రజలను మోసం చేశారని కూడా ఆయన విమర్శించారు.