మంత్రి నారా లోకేశ్ ను కలిసిన నటుడు శివాజీ
- హైదరాబాదులో నారా లోకేశ్తో నటుడు శివాజీ భేటీ
- లోకేశ్ నివాసంలో సమావేశం
- లోకేశ్ నాయకత్వం, దార్శనికత స్ఫూర్తినిచ్చాయన్న శివాజీ
- లోకేశ్ను ‘ప్రజా గొంతుక’గా అభివర్ణించిన నటుడు
- ఈ సందర్భంగా లోకేశ్కు ఓ ప్రత్యేక పుస్తకం బహూకరణ
టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. హైదరాబాద్లోని లోకేశ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం లోకేశ్ నాయకత్వ పటిమ, దార్శనికతపై శివాజీ ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నారా లోకేశ్ గారిని ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ను ‘ప్రజా గొంతుక’ (The Voice Of People) అని అభివర్ణిస్తూ శివాజీ కితాబిచ్చారు.
ఈ సందర్భంగా తాను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్కు బహూకరించినట్లు శివాజీ తన పోస్టులో వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్న శివాజీ, ఇప్పుడు నేరుగా లోకేశ్ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారిద్దరి భేటీకి గల కారణాలపై చర్చ జరుగుతోంది.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నారా లోకేశ్ గారిని ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ను ‘ప్రజా గొంతుక’ (The Voice Of People) అని అభివర్ణిస్తూ శివాజీ కితాబిచ్చారు.
ఈ సందర్భంగా తాను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్కు బహూకరించినట్లు శివాజీ తన పోస్టులో వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్న శివాజీ, ఇప్పుడు నేరుగా లోకేశ్ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారిద్దరి భేటీకి గల కారణాలపై చర్చ జరుగుతోంది.