Narendra Modi: చైనాలో మోదీకి ఘన స్వాగతం: 'వందేమాతరం' నినాదాలతో హోరెత్తిన విమానాశ్రయం

Narendra Modi Receives Grand Welcome in China
షార్ట్స్‌లో చూడండి
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాంజిన్‌లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆయన్ను ఆహ్వానించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అంటూ దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ, ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతంపై సంతోషం వ్యక్తం చేశారు. "చైనాలోని భారత సమాజం టియాంజిన్‌లో ఎంతో ప్రత్యేకమైన స్వాగతం పలికింది" అని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా తెలియజేశారు. ఎస్‌సీవో సదస్సులో భాగంగా వివిధ దేశాల అధినేతలతో లోతైన చర్చలు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి మోదీ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Go Back to Shorts
Narendra Modi
China SCO Summit
SCO Summit
Tianjin Airport
Indian Diaspora China
Xi Jinping

More Telugu News