Wasim Akram: భారత్-పాక్ జట్లు టెస్టు మ్యాచ్ లు ఆడితే చూడాలని ఉంది: వసీం అక్రమ్

Wasim Akram Wants India Pakistan Test Matches
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. అయితే ఐసీసీ, ఇతర టోర్నీలకే పరిమితమైన ఈ పోరును టెస్ట్ ఫార్మాట్‌లోనూ చూడాలని ఉందని పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆసియా కప్ టోర్నీ అభిమానులకు ఒక పండగ లాంటిదని, అయితే ఈ రెండు జట్లు టెస్ట్ సిరీస్ ఆడితే అది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్రమ్, టీమిండియా ప్రస్తుత ఫామ్‌పై ప్రశంసలు కురిపించారు. "ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఒత్తిడిని అధిగమిస్తే వారు ఆసియా కప్‌లో కచ్చితంగా విజయం సాధిస్తారు" అని జోస్యం చెప్పారు.

అదే సమయంలో, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు, అభిమానులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. "భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎప్పటిలాగే వినోదాత్మకంగా ఉంటాయి. అయితే ఆటగాళ్లు, అభిమానులు క్రమశిక్షణతో ఉండి, హద్దులు దాటకుండా ఉంటారని ఆశిస్తున్నా" అని అక్రమ్ పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో, 2013 నుంచి భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి బహుళ దేశాల టోర్నీలలో మాత్రమే తటస్థ వేదికలపై ఈ జట్లు ఆడుతున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Wasim Akram
India vs Pakistan
Asia Cup 2024
India Pakistan Test Series
Cricket
ICC Tournaments
Bilateral Series
Pahalgam Attack
Cricket News

More Telugu News