Dharmasthala: ధర్మస్థలలో శవాలను పూడ్చిపెట్టానని చెప్పిన శానిటరీ వర్కర్ ఫేస్ ఇదే!

Dharmasthala Sanitary Worker face revealed
షార్ట్స్‌లో చూడండి
ధర్మస్థల కేసు దర్యాప్తులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏళ్ల క్రితం అమ్మాయిలపై దారుణాలు జరిగాయని, మృతదేహాలను తానే పాతిపెట్టానని చెప్పి కలకలం రేపిన శానిటరీ వర్కర్, ఇప్పుడు సిట్ అధికారులనే తప్పుదోవ పట్టించిన ఆరోపణలతో అరెస్టయ్యాడు. అతను చెప్పిన సమాచారం పూర్తిగా అవాస్తవమని దర్యాప్తులో తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, 1995 నుంచి 2004 మధ్య కాలంలో పలువురు అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ శవాలను తన చేతుల మీదుగానే పాతిపెట్టానని శానిటరీ వర్కర్ సిట్‌కు వాంగ్మూలం ఇచ్చాడు. అతని సమాచారం ఆధారంగా అధికారులు అతను చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టారు. అయితే, గంటల తరబడి శ్రమించినా అక్కడ ఎలాంటి మృతదేహాలు గానీ, మానవ అవశేషాలు గానీ లభించలేదు.

దీంతో, అతను దర్యాప్తు బృందాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించాడనే నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ విచారణ సమయంలో అతని భద్రత దృష్ట్యా ముఖానికి మాస్క్ వేసి గోప్యత పాటించారు. అయితే, తాజాగా జాతీయ మీడియాలో అతని ముఖంతో కూడిన ఫొటో ప్రచురితం కావడంతో 'మాస్క్ మనిషి' ఇతనేనంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో తాజా పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Dharmasthala
Dharmasthala case
Sanitary worker
SIT investigation
False information
Arrest
Karnataka
Crime news
Investigation update

More Telugu News