AP High Court: విద్యార్థుల స్థానికతపై క్లారిటీ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- విద్యార్థుల స్థానికతపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
- వరుసగా నాలుగేళ్లు చదివితేనే లోకల్ స్టేటస్
- ఇంటర్మీడియట్ చదువు కూడా తప్పనిసరిగా పరిగణన
- రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఈ నిబంధన
- విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేత
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల స్థానికత (లోకల్ స్టేటస్) నిర్ధారణపై నెలకొన్న సందిగ్ధతకు ఉన్నత న్యాయస్థానం తెరదించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్తో కలిపి వరుసగా నాలుగేళ్లపాటు విద్యాభ్యాసం చేసిన వారినే స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
విద్యా, ఉద్యోగాల్లో స్థానికతను ఎలా గుర్తించాలనే అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, ఒక విద్యార్థి ఏపీలో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక హోదా పొందుతారని తేల్చిచెప్పింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు స్థానిక అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించింది.
గతంలో ఇదే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఫుల్బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. స్థానికత నిబంధనలను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో ఎలాంటి పసలేదని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది. ఈ తీర్పుతో విద్యార్థుల స్థానికత నిర్ధారణ ప్రక్రియలో స్పష్టత వచ్చినట్లయింది.
విద్యా, ఉద్యోగాల్లో స్థానికతను ఎలా గుర్తించాలనే అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, ఒక విద్యార్థి ఏపీలో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక హోదా పొందుతారని తేల్చిచెప్పింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు స్థానిక అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించింది.
గతంలో ఇదే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఫుల్బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. స్థానికత నిబంధనలను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో ఎలాంటి పసలేదని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది. ఈ తీర్పుతో విద్యార్థుల స్థానికత నిర్ధారణ ప్రక్రియలో స్పష్టత వచ్చినట్లయింది.