లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ కన్నుమూత
- 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన వేస్ పేస్
- భారత్ తరపున హాకీ ఆడిన వేస్ పేస్
- 1972 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పేస్
మన దేశ చరిత్రలో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తండ్రీకొడుకులుగా వేస్ పేస్, లియాండర్ పేస్ నిలిచారు. 1996 ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించారు. వేస్ పేస్ భార్య కూడా క్రీడాకారిణి కావడం గమనార్హం. భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టుకు ఆమె కెప్టెన్ గా వ్యవహరించారు. 1972 ఒలింపిక్స్ లో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.