కోదండరామ్, అలీఖాన్‌ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • నియామకాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం
  • తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ తెలంగాణ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో వారికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.

వారి నియామకాలను నిలిపివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది.

Kodandaram
Telangana MLC
Amir Ali Khan
Dasoju Shravan
BRS Party
Telangana Governor

More Telugu News