KTR: ఆధారాలు చూపించు, లేదంటే క్షమాపణ చెప్పు: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

KTR Fires on Bandi Sanjay Over Allegations
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలను 48 గంటల్లోగా వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బండి సంజయ్‌పై పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తానని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు త్వరలోనే ఆయనకు అధికారికంగా లీగల్ నోటీసులు పంపనున్నట్లు స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాజకీయ లబ్ధి కోసమే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం ఉన్నా బయటపెట్టాలని సవాల్ విసిరారు. కేవలం తన ఢిల్లీ బాస్‌లను మెప్పించడం కోసమే బండి సంజయ్ ఇలాంటి వీధి డ్రామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ తీరుపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంటెలిజెన్స్ పనితీరుపై కనీస అవగాహన అటుంచి, సాధారణ పరిజ్ఞానం కూడా లేదు. ఆయన వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నాయి" అని విమర్శించారు. "ఢిల్లీ బాస్‌ల చెప్పులు మోసినంత సులభం కాదు బాధ్యతాయుతమైన మంత్రి పదవిని నిర్వహించడం," అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారాలు ఆయన స్థాయిని మరింత దిగజార్చుతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
KTR
KTR
Bandi Sanjay
BRS
Telangana
Phone Tapping
Defamation
Legal Notice
Politics
Central Government

More Telugu News