విజయవాడలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ
- విజయవాడలో ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్
- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
- ఏకలవ్య స్కూళ్ల బిల్లుల కోసం రూ. 25 లక్షలు డిమాండ్
- కాంట్రాక్టర్ నుంచి నగదు స్వీకరిస్తుండగా అరెస్ట్
- భారీ అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) అబ్బవరపు శ్రీనివాస్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.
అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన శాఖలో ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి లంచం కేసులో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.
అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన శాఖలో ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి లంచం కేసులో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.