శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత
- విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృత తనిఖీలు
- బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం
- మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పట్టణాల్లో జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.