మోదీకి దమ్ముంటే ట్రంప్ ఓ అబద్ధాల కోరు అని పిలవాలి: రాహుల్ గాంధీ

  • పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై చర్చ 
  • మోదీ ఇమేజ్ కాపాడుకోవడానికే ఈ ఆపరనేషన్ అని రాహుల్ విమర్శలు 
  • ట్రంప్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడంలేదని నిలదీత
పార్లమెంటు సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్'పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠను కాపాడుకోవడానికే నిర్వహించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు.

తన విమర్శల పరంపరను కొనసాగిస్తూ, భారత-పాకిస్థాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతే అని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ను 'అబద్ధాలకోరు' అని మోదీ ప్రకటించాలని గాంధీ సూటిగా సవాల్ విసిరారు. ఒక దేశాధినేత మన వ్యవహారాల్లో వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని గాంధీ అన్నారు.

దీంతో పాటు, పాకిస్థాన్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో డొనాల్డ్ ట్రంప్ సమావేశం కావడంపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ ఆసిమ్ మునీర్‌కు పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తిని ట్రంప్ కలిసినప్పుడు ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని లదీశారు. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఇండోనేషియాలోని భారత రక్షణ శాఖ అటాషే కెప్టెన్ శివకుమార్ చేసిన కీలక వ్యాఖ్యలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లేదా వారి వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోకుండా కొన్ని 'రాజకీయ నాయకత్వ పరిమితులు' అడ్డుకున్నాయని, అందువల్లే భారతదేశం కొన్ని విమానాలను కోల్పోయిందని శివకుమార్ పేర్కొన్నట్లు గాంధీ గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు దేశ భద్రతపై రాజకీయ నాయకత్వం పాత్ర గురించి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.


More Telugu News