హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు

  • పవర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు
  • ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడి
  • విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపిన ఎయిరిండియా
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి యాక్సిలరీ విద్యుత్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన కాసేపటికి పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.


More Telugu News