ఏపీలో 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం... పూర్తి జాబితా ఇదిగో!

  • ఏఎంసీ నియాకమాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
  • టీడీపీ నుంచి 53, జనసేన నుంచి 9 మంది, బీజేపీ నుంచి నలుగురికి చాన్స్
  • సామాజిక సమీకరణాలు అనుసరించి కూటమి సర్కారు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల (ఏఎంసీ) నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లను ఖరారు చేసింది. ఈ నియామకాల్లో టీడీపీ నుంచి 53 మంది, జనసేన పార్టీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి నలుగురు చైర్మన్‌లుగా అవకాశం పొందారు.


ఈ 66 చైర్మన్‌ పదవుల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గాల నుంచి 17 మంది, షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) నుంచి 10 మంది, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురు చైర్మన్‌లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించే లక్ష్యంతో జరిగాయి.


ఈ చైర్మన్‌ల నియామకం ద్వారా వ్యవసాయ రంగంలో సమర్థవంతమైన నిర్వహణ, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.



More Telugu News