అక్రమ సంబంధం ఆరోపణలతో మహిళపై దాడి.. మోగల్లులో దారుణం
వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లుకు చెందిన ఓ మహిళపై నిన్న దాడి జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మరో మహిళ తన బంధువులతో కలిసి ఈ దాడికి పాల్పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా బాధితురాలిని చెట్టుకు కట్టేసి చితకబాదింది.
మంగళవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ దాడి కొనసాగింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మహిళను, ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ దాడి కొనసాగింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మహిళను, ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.