లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల లంచ్ మెనూ చూశారా...!

  • లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ టెస్టు 
  • నేడు ఆటకు రెండో రోజు
  • లంచ్ మెనూ కార్డును సోషల్ మీడియాలో పంచుకున్న లార్డ్స్ నిర్వాహకులు
లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. కాగా, రెండో రోజు ఆటకు సంబంధించిన ఆటగాళ్ల లంచ్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెనూ కార్డును లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. డే-2 మెనూ... అంటూ నోరూరించే వంటకాలను ఆటగాళ్లకు అందుబాటులో ఉంచినట్టు ఈ మెనూ చూస్తే అర్థమవుతోంది. చికెన్ మీట్ బాల్స్, కాడ్ చేపలు, రొయ్యలు, గొర్రె పిల్ల మాంసం, పనీర్ టిక్కా, బాస్మతి రైస్ వంటి మల్టీ క్యూజిన్ వంటకాలను ఇందులో చూడొచ్చు. 
  • బటర్ నట్ స్క్వాష్ సూప్
  • హ్యారిస్సా మ్యారినేటెడ్ చికెన్ మీట్ బాల్స్
  • మిసో మ్యారినేటెడ్ కాడ్ లోయిన్
  • లాంబ్ రైల్వే కర్రీ
  • పంప్కిన్ కుర్మా
  • పీ అండ్ మింట్ టార్టెల్లిని
  • పనీర్ టిక్కా
  • రొయ్యలు/మేరీ రోజ్ సాస్
  • బాస్మతి రైస్
  • క్రష్డ్ న్యూ పొటాటోస్
  • క్యారట్స్, ఫ్రెంచ్ బీన్స్, బ్రాకోలి
  • ఫ్రూట్ సలాడ్
  • గ్రీక్ యోగర్ట్
వంటి వంటకాలను ఈ మెనూలో పొందుపరిచారు. 


More Telugu News