కాంగ్రెస్ సభతో హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు.. గంటల తరబడి రోడ్లపైనే నగరవాసులు
- హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ 'సామాజిక న్యాయ సమర భేరి' సభ
- సభ కారణంగా నగరంలో పలుచోట్ల భారీ ట్రాఫిక్ జామ్
- కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలతో వాహనదారుల ఇక్కట్లు
- లక్డీకాపూల్, మాసబ్ట్యాంక్, పంజాగుట్ట, నాంపల్లిలో తీవ్రమైన రద్దీ
ఈ భారీ సభ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలైన లక్డీకాపూల్, మాసబ్ట్యాంక్, పంజాగుట్ట, రవీంద్రభారతి, నాంపల్లి వంటి మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ముఖ్యంగా సచివాలయం, ఇందిరా పార్క్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే మార్గంలో ఉదయం నుంచే రద్దీ మొదలైంది. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను, సుజాత స్కూల్ లేన్ నుంచి వచ్చే ట్రాఫిక్ను నాంపల్లి వైపు మళ్లించారు. రవీంద్రభారతి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా నాంపల్లి మీదుగా పంపించారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, బషీర్బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల వైపు రావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.