అమెరికాకు ఇరాన్ కఠిన షరతు.. ఆ హామీ ఇస్తేనే అణు చర్చలు!
- అమెరికాతో చర్చలకు ఇరాన్ మెలిక
- దాడి చేయబోమని మాటివ్వాలని షరతు
- గత దాడుల్లో శాస్త్రవేత్తలు, పౌరులను కోల్పోయామని ఆవేదన
గతంలో తమ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దాడులు చేసిందని ఇరాజ్ ఎలాహి గుర్తుచేశారు. ఈ దాడుల్లో తమ దేశం ఎంతోమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సైనిక అధికారులతో పాటు అమాయక పౌరులను కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, అలాంటి దేశం తమపై దాడులు చేయడం సరికాదని ఆయన విమర్శించారు.
చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాతో చేతులు కలిపి ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం దౌత్య ద్రోహమని ఆయన ఆరోపించారు. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చట్టాలను పూర్తిగా ఉల్లంఘించాయని అన్నారు. చరిత్రలో ఇరాన్ ఏ దేశం పైనా దాడి చేయలేదని, గాజా విషయంలో కూడా శాంతియుత వైఖరినే ప్రదర్శించిందని తెలిపారు. తాము ఎప్పుడూ దౌత్యానికి సిద్ధంగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.