Revanth Reddy: షిర్డీసాయిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధాంగి గీతారెడ్డి

Geetha Reddy Visits Shiridi Sai Baba Temple
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధాంగి గీతారెడ్డి మహారాష్ట్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గీతారెడ్డి బుధవారం షిర్డీకి చేరుకుని సాయిబాబా మధ్యాహ్న హారతి సేవలో పాల్గొన్నారు. జీవితంలో షిర్డీ క్షేత్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలో దర్శనం అనంతరం, ఆలయ ప్రాంగణంలో ఉన్న ద్వారకామాయి, గురుస్థాన్‌లను కూడా ఆమె సందర్శించారు.

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు గీతారెడ్డికి స్వాగతం పలికారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ మర్యాదల ప్రకారం ఆమెను శాలువాతో సత్కరించారు. అనంతరం సాయిబాబా జ్ఞాపికగా ఒక విగ్రహాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. గీతారెడ్డి పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Go Back to Shorts
Revanth Reddy
Geetha Reddy
Shiridi
Sai Baba
Telangana CM
Shiridi Sai Baba Temple

More Telugu News