Byreddy Shabari: జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బైరెడ్డి శబరి

TDP MP Byreddy Shabari Attacks Jagan
  • చిల్లర రాజకీయాలతో పాదయాత్ర చేస్తే జనం చెప్పులతో కొడతారన్న శబరి
  • వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు
  • కదిరిలో సీబీఐ దాడులపై వైసీపీ సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్యే కందికుంట
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. వైసీపీ విధానాలపై, జగన్‌పై వేర్వేరు కార్యక్రమాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. "గడిచిన ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. అది చేయకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పులతో కొడతారు" అని జగన్‌ను ఉద్దేశించి తీవ్రంగా హెచ్చరించారు.

జగన్ ఐదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని, తమ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసి చూపించిందని శబరి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.

మరోవైపు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కూడా వైసీపీపై విమర్శలు చేశారు. స్థానికంగా జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కదిరిలో వైసీపీ నేతలపై జరుగుతున్న సీబీఐ దాడుల గురించి ప్రస్తావించారు. "దేశవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తుంటే, అందులో కదిరి వైసీపీ నేతలు ఉండటం సిగ్గుచేటు" అని ఆయన ఎద్దేవా చేశారు.

More Telugu News

Byreddy Shabari
Jagan
YS Jagan
YSRCP
TDP
Andhra Pradesh Politics
Nandyal
Kadiri
Kandikunta Venkata Prasad
CBI Raids