తేజేశ్వర్ హత్యలో సంచలనం.. ఐశ్వర్య తల్లితోనూ ప్రియుడి అక్రమ సంబంధం!

Tejeshwar Murder Case Shocking Details Revealed in Gadwal
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లోని గద్వాల జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కీలక వివరాలు వెల్లడించారు. వివాహమైన నెల రోజులు కూడా గడవకముందే భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్‌రావుతో కలిసి కిరాయి హంతకుల (సుపారీ గ్యాంగ్‌) సాయంతో భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు గద్వాల ఎస్పీ గురువారం మీడియాకు తెలిపారు. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాలను ఆయన వివరించారు.

అదృశ్యం నుంచి హత్య వరకు..
ఈ నెల 17న తేజేశ్వర్‌ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ నెల 21న గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్‌ మృతదేహం లభ్యమైందని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం అనంతరం హత్యగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేశారు.

ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్‌రావుతో కలిసి తేజేశ్వర్‌ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం వారు సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించారు. తేజేశ్వర్‌ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిందితులు జీపీఎస్‌ ట్రాకర్‌ను ఉపయోగించారని ఎస్పీ వివరించారు. పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు కలిసి తేజేశ్వర్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని ఆయన తెలిపారు.

వివాహేతర సంబంధం.. రెండో పెళ్లికి కుట్ర
ఈ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు తిరుమల్‌రావుకు హత్యకు గురైన తేజేశ్వర్‌ భార్య ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతోనే తిరుమల్‌రావు ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు ఎస్పీ వివరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Go Back to Shorts
Tejeshwar Murder Case
Gadwal murder
private surveyor
Aishwarya
Thirumal Rao
supari gang
extra marital affair
Telangana crime news
GPS tracker

More Telugu News