78 ఏళ్ల వయసులో ఆర్జేడీ అధ్యక్ష పదవికి లాలు నామినేషన్
- 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
- పాట్నాలో నామినేషన్ పత్రాలు దాఖలు
- జులై 5న అధికారికంగా ప్రకటించనున్న పార్టీ
- తేజస్వి క్రియాశీలకంగా ఉన్నా లాలూకే పార్టీ పగ్గాలు
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ పునఃనియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో యువ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రధాన భూమిక పోషిస్తూ, ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, పార్టీ బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయంలో లాలూ ప్రస్తుతానికి సుముఖంగా లేరని దీనిని బట్టి తెలుస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ప్రచార సారథ్యం వహించి, పార్టీ పోస్టర్లలో ప్రముఖంగా కనిపించారు. అయితే, ఆ ఎన్నికల్లో మహాకూటమి విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది.
78 ఏళ్ల వయసులో లాలు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా ప్రచారం చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ, జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఉనికి రాజకీయంగా ఉత్కంఠభరితమైన వాతావరణంలో పార్టీకి స్థిరత్వం చేకూరుస్తుందని భావిస్తున్నారు. యువతరం ఇప్పటికే రోజువారీ రాజకీయాలను నడిపిస్తున్నప్పటికీ, పార్టీ పగ్గాలను పూర్తిగా అప్పగించడానికి అధిష్ఠానం ఇంకా సిద్ధంగా లేదని లాలు నామినేషన్ ద్వారా స్పష్టమైంది.