Prashanthi Reddy: బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన

MLA Prashanthi Reddy responds to girl assault incident
షార్ట్స్‌లో చూడండి
ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. కోలుకున్నాక వేమిరెడ్డి ట్రస్ట్‌ ద్వారా బాలిక బాగోగులు చూసుకుంటామని, చదువుతో పాటు పూర్తి బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచనలతో టీడీపీ స్థానిక నేతలు కోడూరు కమలాకర్‌ రెడ్డి, దువ్వూరు కల్యాణ్‌ రెడ్డి, పవన్‌ రెడ్డి, షేక్‌ ఇంతియాజ్‌ బాధిత బాలికను నెల్లూరుకు తరలించి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
Go Back to Shorts
Prashanthi Reddy
Vemireddy Prashanthi Reddy
MLA Prashanthi Reddy
Nellore
Andhra Pradesh
Girl assaulted
Phone theft
Apollo Hospital Nellore
Vemireddy Trust
Indukurpet

More Telugu News