Hyderabad: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుష్మ బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. విచారణ చేపట్టగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. 

సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Hyderabad
Sushma
Durgam Cheruvu Cable Bridge
Suicide
Hi-Tech City
Telangana
Police Investigation
Death
Missing Person

More Telugu News