మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత ఫోన్
- మొహర్రం నిధులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత ఫోన్
- గత ఏడాది మొహర్రంకు కాంగ్రెస్ నిధులు ఇవ్వలేదని, ఏనుగు ఊరేగింపునకు అనుమతించలేదని ఆరోపణ
- ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి కవిత సూచన
గత కేసీఆర్ ప్రభుత్వం 2023లో మొహర్రం నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించిందని కవిత గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొహర్రం కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆమె తెలిపారు. 2024లో మొహర్రం సందర్భంగా ఏనుగుపై ఊరేగింపు నిర్వహించుకునేందుకు ముస్లింల సంప్రదాయం ప్రకారం అనుమతి కోరితే, ప్రభుత్వం నిరాకరించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్య ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఈ ఏడాది మొహర్రం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, సంప్రదాయబద్ధంగా పండుగ జరిగేలా చూడాలని ఆమె మంత్రిని కోరారు.
ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన అంశాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిధుల విడుదల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, మొహర్రం పండుగను ముస్లింలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేస్తానని కవితకు మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది.