స్వదేశీ టెస్టుల షెడ్యూల్లో మార్పులు.. బీసీసీఐ కీలక ప్రకటన
- భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ కోల్కతాకు తరలింపు
- వెస్టిండీస్తో రెండో టెస్ట్ ఢిల్లీలో నిర్వహణ
- మహిళల భారత్-ఆస్ట్రేలియా వన్డే వేదికల్లో మార్పులు
- అహ్మదాబాద్లోనే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆరంభం
- ఆటగాళ్లు, అభిమానుల సౌకర్యార్థమే ఈ నిర్ణయమని బీసీసీఐ వెల్లడి
బీసీసీఐ 2025 అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్లో భాగంగా స్వదేశంలో జరగనున్న కొన్ని కీలక టెస్ట్ మ్యాచ్ల వేదికల్లో మార్పులు చేసినట్లు సోమవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ల షెడ్యూల్ను మార్చింది. మ్యాచ్ల నిర్వహణకు మెరుగైన పరిస్థితులు కల్పించడం, ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా 2025 నవంబర్ 14న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ను కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. ఈ మార్పుతో సుదీర్ఘ కాలం తర్వాత ఈడెన్ గార్డెన్స్ ఓ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అలాగే వెస్టిండీస్తో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్కు ముందుగా కోల్కతాను వేదికగా నిర్ణయించగా, తాజా మార్పులతో ఆ మ్యాచ్ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్లో ప్రారంభం కానుంది.
ఆటగాళ్లకు, అభిమానులకు సాధ్యమైనంత ఉత్తమమైన సౌకర్యాలు, మంచి అనుభూతి కల్పించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు బీసీసీఐ వివరించింది. పురుషుల మ్యాచ్లతో పాటు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వేదికల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి రెండు వన్డేలు న్యూ చండీగఢ్లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మారింది.
అప్డేటెడ్ షెడ్యూల్ ఇదే...
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్
మొదటి టెస్ట్ - అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో
రెండో టెస్ట్ - అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 14 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
మొదటి టెస్ట్- నవంబర్ 14 నుండి నవంబర్ 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్
రెండోటెస్టు- నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు గౌహతిలో
మొదటి వన్డే - నవంబర్ 30 - రాంచీ
రెండో వన్డే - డిసెంబర్ 3న రాయ్పూర్లో
మూడో వన్డే - డిసెంబర్ 6 - వైజాగ్
మొదటి టీ20- డిసెంబర్ 9 - కటక్లో
రెండో టీ20- డిసెంబర్ 11 - ముల్లన్పూర్
మూడు టీ20- డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20- డిసెంబర్ 19 - అహ్మదాబాద్
ఇందులో భాగంగా 2025 నవంబర్ 14న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ను కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. ఈ మార్పుతో సుదీర్ఘ కాలం తర్వాత ఈడెన్ గార్డెన్స్ ఓ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అలాగే వెస్టిండీస్తో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్కు ముందుగా కోల్కతాను వేదికగా నిర్ణయించగా, తాజా మార్పులతో ఆ మ్యాచ్ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్లో ప్రారంభం కానుంది.
ఆటగాళ్లకు, అభిమానులకు సాధ్యమైనంత ఉత్తమమైన సౌకర్యాలు, మంచి అనుభూతి కల్పించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు బీసీసీఐ వివరించింది. పురుషుల మ్యాచ్లతో పాటు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వేదికల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి రెండు వన్డేలు న్యూ చండీగఢ్లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మారింది.
అప్డేటెడ్ షెడ్యూల్ ఇదే...
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్
మొదటి టెస్ట్ - అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో
రెండో టెస్ట్ - అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 14 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
మొదటి టెస్ట్- నవంబర్ 14 నుండి నవంబర్ 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్
రెండోటెస్టు- నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు గౌహతిలో
మొదటి వన్డే - నవంబర్ 30 - రాంచీ
రెండో వన్డే - డిసెంబర్ 3న రాయ్పూర్లో
మూడో వన్డే - డిసెంబర్ 6 - వైజాగ్
మొదటి టీ20- డిసెంబర్ 9 - కటక్లో
రెండో టీ20- డిసెంబర్ 11 - ముల్లన్పూర్
మూడు టీ20- డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20- డిసెంబర్ 19 - అహ్మదాబాద్