Anvesh Reddy: తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి... వీడియో ఇదిగో!

Anvesh Reddy RTC Driver Attacked by Constable in Tirumala
షార్ట్స్‌లో చూడండి
తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ పోలీసు కానిస్టేబుల్ దాడికి పాల్పడిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం రాత్రి తిరుమలలోని మాధవం గెస్ట్ హౌస్ సమీపంలో జరిగినట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే, అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డి, మంగళవారం రాత్రి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే విధుల్ల ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సును నిలిపి ఉంచారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాంబ్ స్క్వాడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్, డ్రైవర్ అన్వేష్ రెడ్డితో వాగ్వాదానికి దిగి, అనంతరం దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఈ ఘటనపై ఆర్టీసీ డ్రైవర్లు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న తమ సిబ్బందిపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితుడైన డ్రైవర్ అన్వేష్ రెడ్డి, ఇతర డ్రైవర్లు మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులతో కలిసి వెంటనే ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం, వారు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యుడైన బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం. 
Go Back to Shorts
Anvesh Reddy
Tirumala
RTC driver
police constable
attack
CCTV footage
Andhra Pradesh
Tirumala Two Town Police Station
Alipiri depot
Madhavam Guest House

More Telugu News